కోట్ల మంది భారతీయుల స్వర్ణ స్వప్నం నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణం దక్కింది. జావెలిన్ త్రో ఫైనల్లో యువ అథ్లెట్ నీరజ్ చోప్రా పసిడి సాధించాడు. 12 మంది పాల్గొన్న పోటీల్లో నీరజ్.. మొత్తం ఆరు రౌండ్లలో వరుసగా.. 87.03 మీ, 87.58 మీ, 76.79 మీ, ఫౌల్, ఫౌల్, అత్యత్తుమ ప్రదర్శన చేశాడు.
అన్ని రౌండ్లలో కూడా నీరజ్ రెండో రౌండ్లో వేసిన 87.58 మీటర్లు అత్యధికం కావడంతో భారత్కు స్వర్ణం దక్కింది. దీంతో అథ్లెటిక్స్లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్ నిరీక్షణకు తెరపడింది.